వైవీయూ ప్రిన్సిపల్‌గా ప్రొఫెసర్‌ రఘునాధరెడ్డి

ABN , First Publish Date - 2023-05-31T23:25:32+05:30 IST

వైవీయూ పోస్టు గ్రాడ్యుయేషన్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రొఫెసర్‌ రఘునాధరెడ్డిని నియమించారు.

వైవీయూ ప్రిన్సిపల్‌గా ప్రొఫెసర్‌ రఘునాధరెడ్డి

నేడు బాధ్యతలు స్వీకరణ

కడప (ఎడ్యుకేషన్‌), మే 31: వైవీయూ పోస్టు గ్రాడ్యుయేషన్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రొఫెసర్‌ రఘునాధరెడ్డిని నియమించారు. నియామక ఉత్తర్వులను ప్రొఫెసర్‌కు వైస్‌ చాన్సలర్‌ చింతా సుధాకర్‌, రిజిసా్ట్రర్‌ ప్రొఫెసర్‌ వెంకటసుబ్బయ్యలు అందించారు. విశ్వవిద్యాలయాన్ని అకడమిక్‌ పరిశోధన ప్రమాణాల పరంగా అభివృద్ధిపథంలో తీసుకెళ్లాలని సూచించారు. ఇది వరకు ప్రిన్సిపల్‌ స్థానంలో ఉన్న ప్రొఫెసర్‌ క్రిష్ణారెడ్డి తన పదవీ కాలం పూర్తి కావడంతో ఈ నియామకం చేపట్టారు. రఘునాధరెడ్డి డిపార్ట్‌మెంటల్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రొఫెసర్‌ పరిశోధకులుగా యూనివర్శిటీలో దశాబ్ధకాలంగా పనిచేస్తున్నారు. ఇది వరకు వైవీయూ వైస్‌ ప్రిన్సిపల్‌గా రెండేళ్లపాటు పనిచేసిన అనుభవం ఉంది. ఈయన ప్రిన్సిపల్‌గా గురువారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-05-31T23:25:32+05:30 IST