అదృశ్యమైన తల్లీబిడ్డలను గుర్తించిన పోలీసులు

ABN , First Publish Date - 2023-03-30T23:33:39+05:30 IST

అదృశ్యమైన తల్లీబిడ్డలను గురువారం పోలీసులు బెంగళూరులో గుర్తించారు. అక్కడి నుంచి కడపకు తీసు కొచ్చి వారి బంధు వులకు అప్పగించారు.

అదృశ్యమైన తల్లీబిడ్డలను గుర్తించిన పోలీసులు

కడప (క్రైం), మార్చి 30: అదృశ్యమైన తల్లీబిడ్డలను గురువారం పోలీసులు బెంగళూరులో గుర్తించారు. అక్కడి నుంచి కడపకు తీసు కొచ్చి వారి బంధు వులకు అప్పగించారు. వివరాలు ఇవీ.. కడప నగరం మోచంపేటకు చెందిన సయ్యద్‌జరీనా తన ఇద్దరు పిల్లలతో ఈనెల 20న అదృశ్యమైన విషయం విదితమే. అయితే తల్లీబిడ్డలు అదృశ్యం కా వడంతో జరీనా తల్లి ఖాదురున్నీసా ఫిర్యాదు మే రకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ సయ్యద్‌ హాసం ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో బెం గళూరులోని వారి బంధువుల వద్ద ఉన్నట్లు పో లీసులు గుర్తించారు. అదృశ్యమైన మహిళ భర్తను, ఆమె తల్లిని సీఐ పిలిపించి వారికి అప్పగించారు.

Updated Date - 2023-03-30T23:33:39+05:30 IST