వైవీయూలో కాగిత రహిత పాలన

ABN , First Publish Date - 2023-05-31T23:23:57+05:30 IST

వైవీయూలో కాగిత రహిత పాలనకు ముందుడగు వేస్తూ ఆధునిక వెబ్‌సైట్‌ను వైస్‌చాన్సలర్‌ చింతా సుధాకర్‌ ప్రారంభించారు.

వైవీయూలో కాగిత రహిత పాలన
వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్న వైస్‌ చాన్సలర్‌ చింతా సుధాకర్‌

కడప (ఎడ్యుకేషన్‌), మే 31: వైవీయూలో కాగిత రహిత పాలనకు ముందుడగు వేస్తూ ఆధునిక వెబ్‌సైట్‌ను వైస్‌చాన్సలర్‌ చింతా సుధాకర్‌ ప్రారంభించారు. విశ్వవిద్యాలయ రిజిసా్ట్రర్‌ వైపీ వెంకటసుబ్బయ్య, ఐటీ సెల్‌ సంచాలకులు ప్రొఫెసర్‌ ఎన్‌వీ శంకర్‌, ఐక్యు ఏసీ బృందంతో కలిసి నెట్‌వర్కింగ్‌ సెల్‌ వెబ్‌సైట్‌ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వైస్‌ చాన్సలర్‌ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, అధ్యాపకులకు సహాయపడేలా సరికొత్త సాంకేతికతను ముందుకు తెచ్చిందన్నారు. అధ్యాపకులు, సిబ్బంది పరిపాలన పరంగా వారి అవసరాలు ఏమైనా ఉంటే ఆన్‌లైన్‌లోనే విజ్ఞాపనలు సమర్పించి పరిష్కారం పొందేలా రూపొందించారని తెలిపారు. ప్రిన్సిపల్‌ క్రిష్ణారెడ్డి, డాక్టర్‌ క్రిష్ణారావు, ఐక్యు ఏసీ ఐటీ సెల్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T23:23:57+05:30 IST