ఓ రామ.. నీనామమెంతో రుచిరా...

ABN , First Publish Date - 2023-03-30T23:31:01+05:30 IST

శ్రీరామనవమి పర్వదిన వేడుకలను గురువారం కడప, క మలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

ఓ రామ.. నీనామమెంతో రుచిరా...
అలంఖాన్‌పల్లెలో స్వామివారి కల్యాణంలో కార్పొరేటరు ఉమాదేవి, మన్మోహన దంపతులు

కడప (కల్చరల్‌), మార్చి 30: శ్రీరామనవమి పర్వదిన వేడుకలను గురువారం కడప, క మలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. సీతారాముల కల్యాణం కనువిందుగా సాగింది. ఇందులో భాగంగా రాములోరి ఆలయల్లో అన్నదానం, వడపప్పు, పానకం, తీర్థప్రసాదాలు పంచిపెట్టారు. కడప నగరం హబీబు ల్లా వీధిలోని సీతారామలక్ష్మణస్వామి ఆలయంలో, విజయదుర్గా కాలనీలో, హౌసింగ్‌ బోర్డు కాలనీలోని కోదండ రామాలయంలో, బాలాజీనగర్‌, రవీంద్రనగర్‌లలో, కొండాపల్లెలో, 49వ డివిజన అలంఖాన్‌పల్లెలో కల్యాణం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నేత జి.లక్ష్మీరెడ్డి, కార్పొరేటరు ఉ మాదేవి పాల్గొన్నారు. అలాగే సింహపురి కాలనీ, రామాంజనేయపురం, నె హ్రూనగర్‌, నాగరాజుపేట, రవీంద్రనగర్‌, మారుతీనగర్‌, నానాపల్లె ఆలయాల్లో సీతారాము కల్యాణం ఘనంగా జరిగింది.

Updated Date - 2023-03-30T23:31:01+05:30 IST