ఆధార్‌ సీడింగ్‌లో నిర్లక్ష్యం తగదు : ఆర్డీవో

ABN , First Publish Date - 2023-01-05T23:44:25+05:30 IST

ఓటరు కార్డుకు ఆధార్‌ సీడింగ్‌లో నిర్లక్ష్యం తగదని ఆర్డీవో మురళి హెచ్చరించారు.

ఆధార్‌ సీడింగ్‌లో నిర్లక్ష్యం తగదు : ఆర్డీవో
బీఎల్‌వోలతో సమీక్ష నిర్వహిస్తున్న ఆర్డీవో మురళి

మదనపల్లె టౌన, జనవరి 5: ఓటరు కార్డుకు ఆధార్‌ సీడింగ్‌లో నిర్లక్ష్యం తగదని ఆర్డీవో మురళి హెచ్చరించారు. గురువారం సాయం త్రం స్థానిక సబ్‌కలెక్టరేట్‌లో మదనపల్లె అర్బ న పరిధిలోని బీఎల్‌వోలతో ఆర్డీవో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ మదనపల్లె పట్టణంలో ఇంత వరకు కేవలం 60శాతం కూడా ఆధార్‌ సీడింగ్‌ పూర్తిచే యడంలో విఫలమవడంపై ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో 1,07,243 మంది ఓటర్లు వుండగా 73,203 మందికి మాత్రమే ఆధార్‌ సీడింగ్‌ చేశారని, మిగిలిన వాటిని చేయకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. మృతి చెందిన ఓటర్లకు సంబంధించి కుటుంబీకుల నుంచి ధృవీకరించుకోవాల న్నారు. నిర్దేశించిన గడువులోగా ఆధార్‌ సీడింగ్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. సమావే శంలో తహసీల్దార్‌ శ్రీనివాసులు, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీల పాల్గొన్నారు.

Updated Date - 2023-01-05T23:44:27+05:30 IST