రేచు కుక్కల దాడిలో దుప్పి మృతి

ABN , First Publish Date - 2023-06-02T22:59:41+05:30 IST

ఎస్‌.రాజంపేట ఎస్సీ కాలనీ సమీప వరి పొలాల వద్ద శుక్రవారం తెల్లవారు జామున రేచు కుక్కల దాడిలో నాలుగు నెలల చుక్కల దుప్పి మృతి చెందిం ది.

రేచు కుక్కల దాడిలో దుప్పి మృతి
దుప్పిని ఖననం చేస్తున్న దృశ్యం

సిద్దవటం, జూన్‌2: ఎస్‌.రాజంపేట ఎస్సీ కాలనీ సమీప వరి పొలాల వద్ద శుక్రవారం తెల్లవారు జామున రేచు కుక్కల దాడిలో నాలుగు నెలల చుక్కల దుప్పి మృతి చెందిం ది. స్థానిక ప్రజల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం తెల్లవారు జామున అడవి నుంచి రేచు కుక్కలు నాలుగు దుప్పిని తరముకుంటూ ఎస్‌.రాజంపేట ఎస్సీ రైతు పొలాల వద్దకు వచ్చి తీవ్రంగా గాయపరిచి చంపేశాయని స్థానిక రైతులు పేర్కొ న్నారు. విషయాన్ని స్థానిక రైతులు అటవీ శాఖ అధికారులకు రైతులు ఫోన్‌ ద్వారా తెలియజేశారు.

సమాచారం తెలుసుకున్న అటవీ సిబ్బంది వెంటనే డీఆర్‌ఓ ఓబులేసు ఆదేశాల మేరకు బీట్‌ ఆఫీసర్‌ రాజశేఖర్‌రెడ్డి, ఏబీఓ హైమావతి, అటవీ సిబ్బందితో సంఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. అప్పటికే దుప్పి పిల్ల తీవ్రగాయాలతో చనిపోయిం ది. దుప్పిని పోస్టు మార్టం నిమిత్తం సిద్దవటం పశువైద్య శాలకు తరలించి పోస్టుమా ర్టం నిర్వహించి సాహెబ్‌ బావి ప్రదేశంలో ఖననం చేశారు.

Updated Date - 2023-06-02T22:59:41+05:30 IST