మల్లెంకొండ హుండీ ఆదాయం రూ. 11.04 లక్షలు
ABN , First Publish Date - 2023-02-21T23:09:52+05:30 IST
మహాశివరాత్రి సం దర్భంగా మల్లెంకొండేశ్వర స్వామి హుండీ ఆదా యం రూ. 11, 04, 390, కొంత బంగారం, వెండి వచ్చినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
బద్వేలు రూరల్, ఫిబ్రవరి 21: మహాశివరాత్రి సం దర్భంగా మల్లెంకొండేశ్వర స్వామి హుండీ ఆదా యం రూ. 11, 04, 390, కొంత బంగారం, వెండి వచ్చినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. గోపవరం మండలం మల్లెంకొండేశ్వరస్వామి హుండీని నెల్లూరు రోడ్డులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో లెక్కించారు. హుండీ ఆదాయం రూ.8,72,708లు, కల్యాణం చదివింపులు రూ.2,31,682, బంగారం 2, 930 మిల్లీ గ్రాములు, వెండి 85 గ్రాములు ఉన్న ట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.