ఆటోను ఢీకొన్న లారీ.. తండ్రి మృతి
ABN , First Publish Date - 2023-02-06T23:45:14+05:30 IST
మండలంలోని శెట్టిగుంట పంచాయతీ రైల్వేస్టేషన సమీపంలో ఆటోను లారీ ఢీకొనడంతో నూకరాజు సుబ్బయ్య (75) అనే వృద్ధుడు మృతి చెందాడు.
కుమారుడు, ఆటో డ్రైవర్కు గాయాలు
రైల్వేకోడూరు(రూరల్), ఫిబ్రవరి 6: మండలంలోని శెట్టిగుంట పంచాయతీ రైల్వేస్టేషన సమీపంలో ఆటోను లారీ ఢీకొనడంతో నూకరాజు సుబ్బయ్య (75) అనే వృద్ధుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు... ఓబులవారిపల్లె మండలం గోవిందంపల్లె పంచాయతీ కొత్తపల్లెకు చెందిన సుబ్బయ్య తిరుపతికి వెళ్లి ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని.. ఆటోలో తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో వెనుక నుంచి లారీ అతి వేగంగా ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కుమారుడు శీను, డ్రైవర్ వెంకటేశు గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి.. మృతదేహన్ని శవపరీక్ష కోసం రాజంపేటకు తరలించినట్లు ఎస్ఐ మోహనకుమార్ గౌడ్ తెలిపారు.