విద్యారంగాన్నికాపాడదాం

ABN , First Publish Date - 2023-05-25T22:56:11+05:30 IST

కాషాయీకర ణను తిప్పికొట్టి విద్యారంగాన్ని కాపాడుకుం దామని ఏఐఎ్‌సఎఫ్‌ మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు వేమయ్య పిలుపునిచ్చారు.

విద్యారంగాన్నికాపాడదాం
జెండాను ఆవిష్కరిస్తున్న ఏఐఎ్‌సఎఫ్‌ మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు వేమయ్య, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి

ఏఐఎ్‌సఎఫ్‌ మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు వేమయ్య

కడప (ఎడ్యుకేషన్‌), మే 25 : కాషాయీకర ణను తిప్పికొట్టి విద్యారంగాన్ని కాపాడుకుం దామని ఏఐఎ్‌సఎఫ్‌ మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు వేమయ్య పిలుపునిచ్చారు. గురువా రం కడప నగరం శ్రీలక్ష్మి వెంకటేశ్వర ఫం క్షన్‌ హాలులో విద్యవైజ్ఞానిక రాజకీయ త్రై తాంతిక శిక్షణ తరగతులను ప్రారంభించా రు. ముందుగా ఏఐఎ్‌సఎఫ్‌ జెండాను ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేమ య్య మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభు త్వం విద్యారంగాన్ని కుఠిలతత్వంతో కాషాయీకరణ చేస్తూ శాస్త్రీయ దృక్పథం కలిగిన అనేక అంశాలను పాఠ్యాంశాల నుంచి చె రిపి వేస్తూ చరిత్రలో అసాంఘిక కార్యకర్తలుగా ముద్ర వేసుకున్న గాడ్సేలాంటి పా ఠ్యాంశాలను రూపొందించడం ఏమిటని ప్ర శ్నించారు. విద్యార్థుల సృజనాత్మకతను గం గలో కలిపినట్లేనన్నారు. దేశంలో అత్యుత్తమ స్వాతంత్ర ప్రతిపత్తి కలిగిన యూజీసీ మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా లాంటి సంస్థల ను నిర్యీర్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చే శారు. మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో విద్యార్థులు, యువకులు, ఉపాధ్యాయులు దగా పడ్డారన్నారు. అందుకోసం పెద్దఎత్తున ఉద్యమ కార్యాచరణతో పోరాటాలకు సిద్ధం కావాలని, పోరాడకపోతే పాలక ప్రభుత్వాలు నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. కాబట్టి పోరాడాల్సిన అవసరం ఉం దన్నారు. ప్రభుత్వ విద్యను పరిరక్షించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఏఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.కేశవరెడ్డి, జాన్సన్‌బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, ఎఐఎ్‌సఎఫ్‌ జిల్ల్లా కార్యదర్శి వలరాజు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-25T22:56:11+05:30 IST