తిరుపతికి తరలివెళ్లిన జనసేన నాయకులు

ABN , First Publish Date - 2023-09-23T23:47:44+05:30 IST

తిరు పతిలో శనివారం జరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ సమీ క్ష సమావేశానికి మదనపల్లె జన సేన నాయకులు తరలివెళ్లారు.

తిరుపతికి తరలివెళ్లిన జనసేన నాయకులు
తిరుపతి సభకు వెళ్తున్న జనసేన నేత రామ్‌దాస్‌చౌదరి, పార్టీనాయకులు, కార్యకర్తలు

మదనపల్లె, సెప్టెంబరు 23: తిరు పతిలో శనివారం జరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ సమీ క్ష సమావేశానికి మదనపల్లె జన సేన నాయకులు తరలివెళ్లారు. రానున్న ఎన్నికల ను దృష్టిలో పెట్టుకుని పార్టీని బలోపేతం చేయడం, ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై ఈ సమీక్షలో పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి నాగబాబు, మీడియా రాష్ట్రఅధికార ప్రతినిధి అజయ్‌కుమార్‌లు పార్టీనేతలతో చర్చించనున్నారు. రెండురోజుల పార్టీ జరిగే ఈ సమా వేశాలకు పార్టీ నియోజకవర్గ ఇనఛార్జి గంగారపు స్వాతి, రాయలసీమకో-కన్వీనర్‌ గంగా రపు రామ్‌దాస్‌చౌదరి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో వెళ్లారు. అలాగే ఆపార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, మైఫోర్సు మహేష్‌ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వేర్వేరుగా వెళ్లారు.

Updated Date - 2023-09-23T23:47:44+05:30 IST