కేసులు పునరావృత్తమైతే జైలు : ఎస్‌ఐ

ABN , First Publish Date - 2023-02-06T23:55:27+05:30 IST

ఎర్రచందనం కేసులు పునరావృతమైతే పీడీ యాక్టు కేసులు తప్పవని, జైలు కెళ్లాల్సిందేనని ఎస్‌ఐ రామకృష్ణ పేర్కొన్నారు.

కేసులు పునరావృత్తమైతే జైలు : ఎస్‌ఐ
గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు

సుండుపల్లె, ఫిబ్రవరి 6: ఎర్రచందనం కేసులు పునరావృతమైతే పీడీ యాక్టు కేసులు తప్పవని, జైలు కెళ్లాల్సిందేనని ఎస్‌ఐ రామకృష్ణ పేర్కొన్నారు. సోమవారం రాత్రి మండల పరిధిలోని మడితాడు పంచాయతీ జీకే రాచపల్లెలో ఎర్రచందనం అక్రమ రవాణా చేసి జైలు అనుభవించిన పాత నేరస్తులతో పాటు గ్రామస్తులకు ప్రత్యేక సమావేశం నిర్వహించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఎర్రచందనం జోలికి వెళ్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఎర్రచందనం మన రాష్ట్ర సంపదని, దాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:55:28+05:30 IST