కేంద్ర మాజీ మంత్రితో ఆత్మీయ సమావేశం
ABN , First Publish Date - 2023-03-30T23:19:20+05:30 IST
కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతా్పతో పలువురు సీనియర్ నాయకులు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. రాజంపేట పార్లమెంట్ నుంచి ఆరు సార్లు ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేసిన ఆయన గత అనుభవాలను పంచుకుంటూ రాజంపేట, చిట్వేలి, కోడూరు ప్రాంతాల్లోని పలువురు సీనియర్ నాయకులతో మాట్లాడారు.
రాజంపేట, మార్చి 30: కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతా్పతో పలువురు సీనియర్ నాయకులు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. రాజంపేట పార్లమెంట్ నుంచి ఆరు సార్లు ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేసిన ఆయన గత అనుభవాలను పంచుకుంటూ రాజంపేట, చిట్వేలి, కోడూరు ప్రాంతాల్లోని పలువురు సీనియర్ నాయకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజంపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి, రైల్వే అండర్బ్రిడ్జి, రైల్వేస్టేషన్ ఆధునీకరణ తన హయాంలో చేసిని అభివృద్ధి కార్యక్రమాలను చర్చించారు. సుదీర్ఘకాలం తరువాత రాజంపేటకు వచ్చిన సాయిప్రతా్పను సన్మానించారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ ఎద్దల సుబ్బరాయుడు, బీజేపీ రాజంపేట పార్లమెంట్ ఇన్చార్జి సాయిలోకేష్ ఆడిటర్ ఎస్ఎస్ పంత్, నందలూరు మాజీ మండలాధ్యక్షుడు పల్లె సుబ్రహ్మణ్యం, డీలర్ల సంఘం మాజీ అధ్యక్షుడు సుబ్బరాయుడు, విశ్రాంత తహశీల్దారు పలుకూరి రమణ, మన్నూరు నాయకులు పాల్గొన్నారు.