అక్రమ ఓట్లను గుర్తించాలి
ABN , First Publish Date - 2023-07-21T23:47:40+05:30 IST
ప్రతి ఇల్లు సర్వే చేసి అక్రమ ఓట్లను గుర్తించాలని కడప టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ వీఎస్ అమీర్బాబు సూచించారు.
టీడీపీ కడప నియోజకవర్గ ఇన్చార్జ్ అమీర్బాబు
కడప (ఎర్రముక్కపల్లె), జూలై 21 : ప్రతి ఇల్లు సర్వే చేసి అక్రమ ఓట్లను గుర్తించాలని కడప టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ వీఎస్ అమీర్బాబు సూచించారు. శుక్రవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో కడప అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఇంటిగ్రేడెడ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో అరాచకాలు, విధ్వంసాలు, అన్యాయాలు జరుగుతున్నాయన్నారు. వీటితో పాటు దొంగ ఓట్లకు వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతి డివిజనులో టీడీపీ డివిజన్ ఇన్చార్జ్లతో పాటు అక్కడున్న మిగతా కమిటీ సభ్యులు కలిసికట్టుగా ప్రతి ఇంటి సర్వే చేసి చనిపోయిన వారిని డబుల్ ఎంట్రీ ఉన్న వారిని గుర్తించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. వాటిని తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటరుగా నమోదు చేయించి టీడీపీ మేనిఫెస్టోను వారికి వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్రెడ్డి, అలంఖాన్పల్లె లక్ష్మిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వికాస్ హరిక్రిష్ణ, నాయకులు శివరాం, ఆ మూరి బాలదాసు, సానపురెడ్డి శివకొండారెడ్డి, కొండా సుబ్బయ్య, జలతోటి జయకుమార్, రవిశంకర్రెడ్డి పాల్గొన్నారు.