బాలికలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి

ABN , First Publish Date - 2023-03-25T22:02:24+05:30 IST

ఆంధ్రప్రదేశ గిరిజన బాలికల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న గ్రామీణ పేద బాలికలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని జిల్లా ఐదవ అదనపు జడ్జి కృష్ణనకుట్టి సూచించారు

బాలికలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి
గిరిజన బాలికల పాఠశాలలో భోజనం చేస్తున్న జిల్లా 5వ అదనపు జడ్జి కృష్ణనకుట్టి

జిల్లా 5వ అదనపు జడ్జి కృష్ణనకుట్టి

రాయచోటిటౌన, మార్చి 25: ఆంధ్రప్రదేశ గిరిజన బాలికల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న గ్రామీణ పేద బాలికలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని జిల్లా ఐదవ అదనపు జడ్జి కృష్ణనకుట్టి సూచించారు. శనివారం ఆయన మాసాపేట సమీపంలోని గిరిజన బాలికల రెసిరెన్షియల్‌ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వసతులపై ఆరా తీశారు. విద్యార్థినులతో కలసి భోజనాన్ని రుచి చూశారు. మెనూ ప్రకారం ప్రతిరోజు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, పరిశుభ్రత పాటించాలన్నారు. ఉపాధ్యాయ బృందం విద్యార్థినులను సొంత బిడ్డల్లా భావించాలన్నారు. పాఠశాలలో పరిసరాల పరిశుభ్రతతో పాటు మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలని, బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని పాఠశాల సిబ్బందికి సూచిం చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ లత, ఉపాధ్యాయ బృందం, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T22:02:24+05:30 IST