కార్మిక వర్గ ప్రయోజనాల కోసమే

ABN , First Publish Date - 2023-05-31T23:21:09+05:30 IST

కార్మిక వర్గ ప్రయోజనాలను కాపడేందుకే ఐఎ్‌ఫటీ యూ పనిచేస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్‌, ఉపాధ్యక్షుడు హరిక్రిష్ణ అన్నారు.

కార్మిక వర్గ ప్రయోజనాల కోసమే
సమావేశంలో మాట్లాడుతున్న ఐఎ్‌ఫటీయూ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్‌

ఐఎ్‌ఫటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్‌

రాయచోటిటౌన్‌, మే31: కార్మిక వర్గ ప్రయోజనాలను కాపడేందుకే ఐఎ్‌ఫటీ యూ పనిచేస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్‌, ఉపాధ్యక్షుడు హరిక్రిష్ణ అన్నారు. స్థానిక ఎన్జీఓ హోంలో నిర్వహించిన జిల్లా జనరల్‌ బాడీ సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పై పోరాటాలు మరింత ఉదృతం చేయడానికి జిల్లా నూతన కమిటీ ఎన్నుకున్నామన్నారు. ఆగస్టులో పెద్ద ఎత్తున ఐఎ్‌ఫటీయూ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం అన్నమయ్య జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

జిల్లా కన్వీనర్‌గా మావులూరి విశ్వనాద్‌, కోకన్వీనర్‌గా సుగ్నేనా, సభ్యులుగా షేక్‌, మస్రూన్‌బీ, హైదర్‌ఖాన్‌, ఆంజనేయులు, గీత, కిరణ్‌కుమారి, ఉమాదేవి, మరో తొమ్మిది మందిని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాము, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నేతలు గంగావతి, ఇందిరమ్మ మదన్‌మోహన్‌, చలపతి, రమ ణ, పోరెడ్డి రమణారెడ్డి, రఘునాధ, పెద్దన్న, వెంకట్రమణ, పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె, రాయచోటి ప్రాంతాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T23:21:09+05:30 IST