చిరుధాన్యాల సాగుపై రైతులు శ్రద్ధ చూపాలి
ABN , First Publish Date - 2023-03-18T23:39:47+05:30 IST
చిరుధాన్యాల సాగుపై రైతులు శ్రద్ధ చూపాలని వైఎస్ఆర్ క్రాంతిపథం ఏపీఎం ఖా దర్వలి కోరారు.

వీరబల్లి, మార్చి18: చిరుధాన్యాల సాగుపై రైతులు శ్రద్ధ చూపాలని వైఎస్ఆర్ క్రాంతిపథం ఏపీఎం ఖా దర్వలి కోరారు. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరానికి చిరుధాన్యాల సంవత్సరంగా గుర్తించిందని, ఇం దుకు సంబంధించిన కార్యక్రమాల ను ప్రధాన మంత్రి నరేంద్రమోడీ శనివారం ఆన్లైన్ ద్వారా ప్రారంభించారని తెలిపారు. మార్చి 1 నుంచి 31 వరకు జిల్లా, మండల, గ్రామ, సంఘాల స్థాయిలో చిరుధాన్యాల ఉత్సవాలు జరుగుతాయన్నారు. మం డల రైతు ఉత్పత్తిదారులు, మహిళా సమాఖ్యల ద్వారా వాటి సాగు విస్తరణ, అమ్మకాలు, ప్రయోజ నాలు, వంటకాల తయారీ తదితర అంశాలపై శిక్షణ ఇస్తారన్నారు. ఈ నెల 28న జిల్లా కేంద్రంలో చిరుధాన్యాలు పండించే రైతులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తార న్నారు. ఈ కార్యక్రమంలో సీసీ వెంకటలక్ష్మి, సుభద్రమ్మ, రైతు మిత్రులు జనమేజయుడు, వెంకటేష్, మరియమ్మ, రైతు, మహిళా సమాఖ్యలు, రైతులు పాల్గొన్నారు.