పుస్తకాలు లేకుండా పరీక్షలా?

ABN , First Publish Date - 2023-02-06T22:38:28+05:30 IST

రాష్ట్రంలో ఉర్దూ మీడియం విద్యార్థులకు రెండో సెమిస్టరుకు సంబంధించిన పుస్తకాలు ఇంత వరకు అందించకుండానే పరీక్షలు నిర్వహించడం చాలా విడ్డూరంగా ఉందని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహే్‌షబాబు ఆరోపించారు.

పుస్తకాలు లేకుండా పరీక్షలా?
మాట్లాడుతున్న లక్ష్మీరాజ

- యుటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా

్జకడప (ఎడ్యుకేషన్‌), ఫిబ్రవరి 6 : రాష్ట్రంలో ఉర్దూ మీడియం విద్యార్థులకు రెండో సెమిస్టరుకు సంబంధించిన పుస్తకాలు ఇంత వరకు అందించకుండానే పరీక్షలు నిర్వహించడం చాలా విడ్డూరంగా ఉందని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహే్‌షబాబు ఆరోపించారు. యూటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఉర్దూ విద్యార్థులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం మంచిది కాదన్నారు. ఇప్పటికైనా విద్యార్థులకు సకాలంలో పాఠ్య పుస్తకాలు అందించిన తరువాతే పరీక్షలు నిర్వహించాలన్నారు. అలాగే 7వ తేదీ వచ్చినప్పటికీ ప్రభుత్వ ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించలేదని చాలా మంది ఉపాధ్యాయులకు హౌస్‌లోన్‌, పర్సనల్‌ లోన్లు ఉండడం వల్ల బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ర్యక్రమంలో యూటీఎఫ్‌ నాయకులు నాగిరెడ్డి, ప్రత్యూష, వెంకటరమణ, కేదార్‌నాఽధ్‌, శ్రీకాంత్‌, పవన్‌కుమార్‌, శైలజ, వెంకటరమణయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T22:38:31+05:30 IST