పాఠశాలలకు తరలుతున్న విద్యాకానుక కిట్లు
ABN , First Publish Date - 2023-06-02T23:30:59+05:30 IST
పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే సమయానికి విద్యార్థులకు కిట్లు అందజేయాలన్న ప్రభు త్వ సూచనలను పాటిస్తూ జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష అధికారులు విద్యాకానుక కిట్లను పాఠశాలలకు తరలిస్తున్నారు.
కడప (ఎడ్యుకేషన్), జూన్ 2 : పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే సమయానికి విద్యార్థులకు కిట్లు అందజేయాలన్న ప్రభు త్వ సూచనలను పాటిస్తూ జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష అధికారులు విద్యాకానుక కిట్లను పాఠశాలలకు తరలిస్తున్నారు. శుక్రవారం కడప నగరం సీఎ్సఐ పాఠశాలలో ఉన్న విద్యాకానుక కిట్లను పాఠశాలలకు తరలించారు. ఈ సందర్భంగా సమగ్రశిక్ష జిల్లా పథక అఽధికారి అంబవరం ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికీ తొలిరోజే జగనన్న విద్యాకానుక అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందుకోసం జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో జగనన్న విద్యాకానుక కిట్లను భద్రపరుచుకుని ఆయా పాఠశాలలకు పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో లక్షా 58 156 మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక పంపాల్సిందిగా రాష్ట్ర ఉన్నతాధికారులకు ఇండెంట్ పంపించామన్నారు. ఈ కార్యక్రమంలో కడప ఎంఈఓ పాలెం నారాయణ, సమగ్రశిక్ష సెక్టోరియల్ అధికారులు కేశవరెడ్డి, దశరథరామిరెడ్డి పాల్గొన్నారు.