తాగునీటి సరఫరాపై నిర్లక్ష్యం తగదు
ABN , First Publish Date - 2023-03-25T23:39:29+05:30 IST
తాగునీటి సరఫరాపై నిర్లక్ష్యం తగదని సీపీఐ నగర సహాయ కార్యదర్శి కేసీ బాదుల్లా డిమాండ్ చేశారు.
కడప (సెవెన్రోడ్స్), మార్చి 25 : తాగునీటి సరఫరాపై నిర్లక్ష్యం తగదని సీపీఐ నగర సహాయ కార్యదర్శి కేసీ బాదుల్లా డిమాండ్ చేశారు. శనివారం స్థానిక అక్కాయపల్లెలో నిర్మిస్తున్న ఉపరితల వాటర్ ట్యాంకును సీపీఐ ప్రతినిధి బృందం పరిశీలించారు. అనంతరం బాదుల్లా మాట్లాడుతూ నగరపాలక సంస్థ అధికారులు, పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాగునీరు అర్ధరాత్రి పూట అందరూ నిద్రపోతున్న వేళల్లో సరఫరా చేయవద్దని, ఒక సమయం ఎంచుకుని అదే సమయంలో ప్రతిరోజూ సరఫరా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ కడప తాలుకా జోన్ కార్యదర్శి సావంత్ సుధాకర్, నాయకులు మునెయ్య, లింగన్న, మైనుద్దీన్, హుసేన్, పుష్పరాజ్, రెడ్డిబాషా, ఎఐఎ్సఎఫ్ జిల్లా కార్యదర్శి వలరాజు పాల్గొన్నారు.