పేదలకు స్థలాలు ఇవ్వాలంటూ ధర్నా

ABN , First Publish Date - 2023-05-18T22:59:23+05:30 IST

గోపవరం మండలం పీపీకుంట సోమశిల ముంపువాసులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ గురువారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బద్వే లు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

పేదలకు స్థలాలు ఇవ్వాలంటూ ధర్నా
ఆర్‌డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న దృశ్యం

బద్వేలు, మే 18: గోపవరం మండలం పీపీకుంట సోమశిల ముంపువాసులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ గురువారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బద్వే లు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శు లు శివకుమార్‌, అన్వేష్‌ మాట్లాడుతూ జగనన్న ఇండ్ల స్థలాలు పీపీకుంట పరిధిలో ఇవ్వకపోవడంతోనే భూ పోరాటం చేపట్టామన్నారు. హైవే విస్తరణలో నష్టపోతున్న బాధితులకు ఇళ్ల స్థలాలు, ఇంటికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఈ విష యంపై 29న కలెక్టర్‌ దృష్టికి తీసుకెళతామన్నారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్‌, భూ పోరాట సాధన మండల నేతలు ఖాదర్‌బాష, ఖాదరయ్య, పెంచలయ్య, స్థానిక నేతలు చాంద్‌బాష, రమణయ్య, గిలకరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-18T22:59:42+05:30 IST