ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన వారి పేర్లను తొలగించండి

ABN , First Publish Date - 2023-03-25T23:42:53+05:30 IST

ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన వారి పేర్లను తొలగించాలని టీడీపీ మండల నేతలు రెవెన్యూ సిబ్బందిని కోరారు.

ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన వారి పేర్లను తొలగించండి

- రెవెన్యూ సిబ్బందికి సూచించిన టీడీపీ నేతలు

చెన్నూరు, మార్చి 25 : ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన వారి పేర్లను తొలగించాలని టీడీపీ మండల నేతలు రెవెన్యూ సిబ్బందిని కోరారు. శనివారం మండల కన్వీనర్‌ కె.విజయభాస్కర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఐ.శివారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మల్లిఖార్జునరెడ్డి, మైనార్టీ జిల్లా నాయకుడు షబ్బీర్‌ హుసేన్‌ చెన్నూరు రెండో సచివాలయంలో ఆర్‌ఐ సృజన, సీనియర్‌ అసిస్టెంట్‌ క్రిష్ణవేణిలతో మాట్లాడారు. మండల వ్యాప్తంగా 36 పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయని, ప్రతి బూత్‌ పరిధిలో దాదాపు 25 నుంచి 30 వరకు చనిపోయిన వ్యక్తుల పేర్లు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. చాలా ఏళ్లుగా వారు బతికే ఉన్నారని వారి పేర్లను జాబితా లో ఉంచడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు ఆకుల చలపతి, మైనార్టీ సెల్‌ జిల్లా కార్యదర్శి మంజూర్‌ అహ్మద్‌, కొండపేట సుధాకర్‌రెడ్డి, బాలక్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:42:53+05:30 IST