డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్షా ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2023-09-25T23:23:35+05:30 IST

వైవీయూ పరిధిలోని డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్ష ఫలితాలను వైస్‌చాన్సలర్‌ ప్రొఫెసరు చింతా సుధాకర్‌, రిజిసా్ట్రరు ప్రొఫెసరు వైపీ వెంకటసుబ్బయ్య, పరీక్షల నియంత్రణ అధికారి ఈశ్వర్‌రెడ్డి విడుదల చేశారు.

డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్షా ఫలితాలు విడుదల

కడప (ఎడ్యుకేషన్‌), సెప్టెంబరు 25: వైవీయూ పరిధిలోని డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్ష ఫలితాలను వైస్‌చాన్సలర్‌ ప్రొఫెసరు చింతా సుధాకర్‌, రిజిసా్ట్రరు ప్రొఫెసరు వైపీ వెంకటసుబ్బయ్య, పరీక్షల నియంత్రణ అధికారి ఈశ్వర్‌రెడ్డి విడుదల చేశారు. సోమవారం వైస్‌ చాన్సలర్‌ తన చాంబరులో పరీక్ష ఫలితాల విడుదల సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు కళాశాలల అభీ ష్టం మేరకు ఐదో సెమిస్టరు పరీక్షలు నిర్వహించామన్నారు. పరీక్షలు పూర్తయిన ఐదు రోజుల్లోనే యుద్ధప్రాతిదికన ఫలితాలు తెలిపామన్నారు. విద్యార్థులు పీజీ సెట్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అనువుగా ఫలితాలు వచ్చాయన్నారు. పరీక్షల నియంత్రణ అధికారి ఈశ్వరరెడ్డి మాట్లాడుతూ సీబీఎస్‌టీ పాట్రన్‌లో జరిగిన బీఏ, బీబీఏ, బీకాం, బీఎస్సీ ఇన్‌స్టంట్‌ పరీక్షలకు 2986 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. వీరిలో 2864 మంది (97 శాతం) ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. కార్యక్రమంలో సహాయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్‌ సుమిత్ర పాల్గొన్నారు.

Updated Date - 2023-09-25T23:23:35+05:30 IST