రాష్ట్రానికి దశ, దిశ చంద్రబాబే..!
ABN , First Publish Date - 2023-04-01T23:25:01+05:30 IST
ఆంధ్ర ప్రదేశ రాష్ట్రానికి మార్గదర్శకుడు చంద్రబాబు నాయుడేనని మాజీ ఎమ్మెల్యే షాజహానబాషా అన్నారు.
మాజీఎమ్మెల్యే షాజహానబాషా
మదనపల్లె అర్బన, ఏప్రిల్1: ఆంధ్ర ప్రదేశ రాష్ట్రానికి మార్గదర్శకుడు చంద్రబాబు నాయుడేనని మాజీ ఎమ్మెల్యే షాజహానబాషా అన్నారు. శనివారం తన కార్యాలయంలో మీడి యా సమావేశంలో ఆయన మాటా ్లడుతూ ఒక అవకాశం అంటూ అధి కారం చేజిక్కించుకున్న జగన ఆ బాధ్యతే మర్చిపోయాడన్నారు. ప్రజలలో అశాంతి నెలకొల్పడం, దౌర్జన్యం, బీసీలు, ఎస్సీలపై దాడులు , అక్రమాలు వైసీపీ నాయకులు ప్రవృత్తిగా మార్చు కున్నారన్నారు. మదనపల్లెలో పాలన ఎత్తిపోయిందని, కొన్ని శాఖల్లో ముఖ్యమైన అధికారులను కూడా వేయించుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. చంద్రబాబు పాలన దక్షుడుగా నిలిచారన్నారు. యువనేత నారాలోకేష్ యువగళం పేరుతో మండే ఎండలను లెక్క చేయకుండా పాద యాత్ర చేస్తున్నాడన్నారు. ప్రజలందరూ మోసపోయామనే భావనతో ఉన్నారని, దీనికి నిదర్శనం ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీీ ప నాయకులు నాదెళ్లశివ, భూమి సీడ్స్ రమణ, సంఘం హరి, కమలమరికృష్ణ, మైనార్టీ నాయకుడు పఠాన ఖాదర్ఖాన, నాగూర్వలి, గిరీష, రఘుపతి నాయుడు, షంషీర్, వేమయ్య, వరుణ్, ఇంతియాజ్, బాలు, నాగమణి, రెడ్డి, శేఖర్, తదితరులుపాల్గొన్నారు.