కుష్ఠు సర్వేకు సహకరించండి
ABN , First Publish Date - 2023-06-26T23:35:45+05:30 IST
కుష్ఠువ్యాధిగ్రస్థులను గుర్తించి, వారికి వైద్యం అందించి, ఆ జబ్బు నుంచి వారిని విముక్తులను చేసేదిశగా వైద్యసిబ్బంది చేపట్టబోయే సర్వేకు ప్రజలు సహకరించాలని మెడికల్ ఆఫీసర్ హజీరా పేర్కొన్నారు.
ప్రొద్దుటూరు క్రైం, జూన్ 26 : కుష్ఠువ్యాధిగ్రస్థులను గుర్తించి, వారికి వైద్యం అందించి, ఆ జబ్బు నుంచి వారిని విముక్తులను చేసేదిశగా వైద్యసిబ్బంది చేపట్టబోయే సర్వేకు ప్రజలు సహకరించాలని మెడికల్ ఆఫీసర్ హజీరా పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం దేవాంగపేట అర్బన్హెల్త్సెంటర్ పరిధిలో నిర్వహించిన కుష్ఠు రోగ నిర్ధారణ సర్వేను ఆమె పరిశీలించారు. అంతకు ఆ ముందు ఆ పరిసరాల్లో ర్యాలీ ద్వారా కుష్ఠుపై అక్కడి ప్రజల్లో అవగాహన కల్గించారు. డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ శివశంకరయ్య, వార్డు కౌన్సెలర్ వరలక్ష్మి, సీవో వెంకటసుబ్బయ్య, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.
ప్రొద్దుటూరు రూరల్..: కుష్ఠువ్యాధి రహిత సమాజం కోసం అందరం కృషి చేద్దామని కామనూరు ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ హనీ్ఫబాబా అన్నారు. మండలంలోని కామనూరు గ్రామంలో సోమవారం ఎల్సీడీసీ (కుష్ఠు రోగుల గుర్తింపు)ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ శ్రీనివా్స,డీటీఎంవో శ్రీను, హెచ్ఈ శోభారాణి, సూపర్వైజరు వర ప్రసాద్, చంద్రకళ, సీహెచ్వోలు, ఆరోగ్య కార్యకర్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.