స్థల విషయమై ఘర్షణ- వ్యక్తికి తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2023-03-30T23:20:14+05:30 IST

మండలంలోని శెట్టిపల్లె గ్రామం రెడ్డిమల్లువారిపల్లెకు చెందిన వెంకట్రమణారెడ్డిపై అదే గ్రామానికి చెందిన రామచంద్ర అతని కుమారుడు వెంకటేశ్వర్లు కొడవలితో గాయపర్చినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

స్థల విషయమై ఘర్షణ- వ్యక్తికి తీవ్రగాయాలు

సంబేపల్లె, మార్చి 30: మండలంలోని శెట్టిపల్లె గ్రామం రెడ్డిమల్లువారిపల్లెకు చెందిన వెంకట్రమణారెడ్డిపై అదే గ్రామానికి చెందిన రామచంద్ర అతని కుమారుడు వెంకటేశ్వర్లు కొడవలితో గాయపర్చినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని వివరాల మేరకు... గురువారం మామిడి తోపు వద్ద కూలీలతో కంప వేస్తూ ఉండగా ఈ స్థలంలో ఏం పని అంటూ దౌర్జన్యం చేయడంతో పాటు కొడవలితో ఘర్షణకు దిగినట్లు తెలిపారు. దీంతో అక్కడే ఉన్న ఆదినారాయణరెడ్డి, రెడ్డిశేఖర్‌, రఘు అడ్డుపడి కాపాడినట్లు తెలియజేశారు. బాధితుడు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించుకుని, మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించినట్లు తెలియజేశారు. విషయం తెలుసుకున్న మాజీ జడ్పీటీసీ మల్లు నరసారెడ్డి, రాయచోటి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి చేరుకొని బాధితుడిని పరామర్శించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-03-30T23:20:14+05:30 IST