గృహ నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ సీరియస్
ABN , First Publish Date - 2023-06-02T22:58:10+05:30 IST
గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే జగనన్న గృహాలపై కలెక్టర్ సీరియ్సగా మాట్లాడినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఆర్డీఓ కార్యాలయం సందర్శించి హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశం అవుతార ని అధికారులంతా హాజరయ్యారు.
అధికారులకు హెచ్చరికలు
జమ్మలమడుగు, జూన్ 2: గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే జగనన్న గృహాలపై కలెక్టర్ సీరియ్సగా మాట్లాడినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఆర్డీఓ కార్యాలయం సందర్శించి హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశం అవుతార ని అధికారులంతా హాజరయ్యారు. మధ్యాహ్నం వరకు అధికారులు వేచి ఉన్నా ఒంటి గంట తర్వాత కలెక్టర్ జమ్మలమడుగు, ముద్దనూరు, ఎర్రగుంట్ల మండలాల హౌసింగ్ అధికారులు, తహసీల్దార్లతో ఇళ్ల నిర్మాణాల పురోగతిపై చర్చించినట్లు తెలుస్తోంది.
పొన్నతోట ఆర్అండ్ఆర్ కాలనీ శివార్లలో జగనన్న గృహ నిర్మాణాల లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు ఏమాత్రం ముందుకు సాగడం లేదని కలెక్టర్ అధికారులను హెచ్చరించినట్లు సమాచారం. అక్కడ కరెంటు స్తంభాలు ఏర్పాటు చేశారని, తీగలు లాగలేదని, మౌలిక వసతులు లేక ఇళ్ల నిర్మాణాలు జరగడంలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా కలెక్ట ర్ విద్యుత్ ఎస్ఈతో మాట్లాడి, సోమవారానికి పనులు జరగాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలుస్తోంది. కార్యక్రమంలో హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
నేడు మగ్గాలు పంపిణీ
మోరగుడి జిల్లా పరిషత్ మైదానంలో ఎన్హెచ్డీసీ గుంతమగ్గాలు పంపిణీ చేస్తున్న ట్లు హ్యాండ్లూమ్ ఏడీ భీమయ్య మోరగుడి చేనేత కార్మికులకు ఆర్డీఓ కార్యాలయం ఎదుట తెలియజేశారు. మొత్తం 300 మందికి పంపిణీ చేస్తారని చెప్పారు. ఈ విషయా న్ని మిగతా చేనేత కార్మికులు మాట్లాడుతూ మగ్గాలు పంపిణీ సమయంలో పూర్తి వివరాలు రాసుకుని ఇళ్లకు మగ్గాలు చేరతాయోలేదో కానీ మళ్లీ తిరిగి క్లస్టర్ల యజమానులకే చేనేతలు ఇస్తారని, బోగస్ చేనేత మగ్గాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.