వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం

ABN , First Publish Date - 2023-05-19T23:23:36+05:30 IST

రోజురోజుకూ ఎండలు పెరిగిపోతున్నాయని, ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో చలివేంద్రం ఏర్పాటు చేశామని దిశ పోలీసుస్టేషన డీఎస్పీ రమాకాంత పే ర్కొన్నారు.

వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం

దిశ పోలీసుస్టేషన డీఎస్పీ రమాకాంత

కడప (క్రైం), మే 19 : రోజురోజుకూ ఎండలు పెరిగిపోతున్నాయని, ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో చలివేంద్రం ఏర్పాటు చేశామని దిశ పోలీసుస్టేషన డీఎస్పీ రమాకాంత పే ర్కొన్నారు. ఎస్పీ అన్బురాజన ఆదేశాల మేరకు దిశ పోలీసుస్టేషన ఆవర ణంలో శుక్రవారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ కడప నగరానికి ఎంతో మంది రాకపోకలు సాగిస్తున్నారని, వాణిజ్య ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రాంతంలో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడకూడదని చలివేంద్రం ఏర్పాటు చేశామన్నారు. సీఐ వినయ్‌కుమార్‌రెడ్డి, సిబ్బంది ద్వారక, లక్ష్మీదేవి పాల్గొన్నారు.

Updated Date - 2023-05-19T23:23:36+05:30 IST