వేడుకగా భీష్మ ఏకాదశి వేడుకలు

ABN , First Publish Date - 2023-02-01T23:24:14+05:30 IST

ఏకశిలా నగిరి కోదండరామాలయంలో భీష్మ ఏకాదశి పురస్కరించుకొని సీతారామ లక్ష్మణులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారామలక్ష్మణులను ప్రత్యేకంగా అలంకరించి రామాలయం నుంచి పురవీధుల గుండా గ్రామోత్సవాన్ని టీటీడీ అర్చకులు, అధికారులు నిర్వహించారు.

వేడుకగా భీష్మ ఏకాదశి వేడుకలు
భక్తులకు దర్శనమిస్తున్న సీతారామ లక్ష్మణులు

ఒంటిమిట్ట, ఫిబ్రవరి 1: ఏకశిలా నగిరి కోదండరామాలయంలో భీష్మ ఏకాదశి పురస్కరించుకొని సీతారామ లక్ష్మణులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారామలక్ష్మణులను ప్రత్యేకంగా అలంకరించి రామాలయం నుంచి పురవీధుల గుండా గ్రామోత్సవాన్ని టీటీడీ అర్చకులు, అధికారులు నిర్వహించారు. వేకువజామున మూలవిరాట్లకు ప్రత్యేక అభిషేకం నిర్వహించి పట్టువస్త్రాలతో స్వామి వారిని అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శనం ఇచ్చారు. గ్రామోత్సవంలో పెద్దఎత్తున మహిళలు, భక్తులు స్వామి వారికి కాయా, కర్పూరం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీటీడీ అర్చకులు మనోజ్‌కుమార్‌, టీటీడీ ఇన్‌స్పెక్టర్‌ ధనుంజయుడు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:24:15+05:30 IST