కోనేటిలో పడి బాలుడు మృతి
ABN , Publish Date - Dec 18 , 2023 | 12:07 AM
చేపలు పట్టే ఎరలు ఏరుకునేందుకు కోనేటిలో దిగి న ముకుందతేజ(6) అనే బాలుడు అందు లో పడి మృతి చెందిన సంఘటన మదన పల్లె మండలం సీటీఎంలో జరిగింది.
మదనపల్లె టౌన, డిసెంబరు 17: చేపలు పట్టే ఎరలు ఏరుకునేందుకు కోనేటిలో దిగి న ముకుందతేజ(6) అనే బాలుడు అందు లో పడి మృతి చెందిన సంఘటన మదన పల్లె మండలం సీటీఎంలో జరిగింది. మద నపల్లె మండలం సీటీఎం పంచాయతీ చెం చులక్ష్మికాలనికి చెందిన నాగరాజు కుమారు డు ముకుందతేజ శనివారం చెంచులక్ష్మి కాల నీ పక్కన ఉన్న శివాలయం కోనేటి వద్దకు వెళ్లాడు. అక్కడ ఎరలు ఏరుకుంటూ ప్రమాదవశాత్తు కోనేటిలో పడిపోయాడు. ఈ విషయం ఎవరు గమనించకపోవడం, రాత్రి అయినా తమ కుమారుడు ఇంటికి రాకపోవడంతో నాగరాజు కుటుంబీకులు చుట్టుపక్కల వెతికారు. దీంతో ఆదివారం మదన పల్లె తాలూకా సీఐ శేఖర్కు బాలుడు కనపడలేదని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం చెంచులక్ష్మికాలనీ పక్కన కోనేటిలో ముకుందతేజ మృతదేహం తేలాడటంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా వారు అక్క డికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు.