ధ్యాన కేంద్రం ప్రారంభం

ABN , First Publish Date - 2023-03-19T23:16:59+05:30 IST

పట్టణంలోని న్యాక్‌ బిల్డింగ్‌ వెనుక 19.50ఎకరాల్లో రూ.2కోట్లతో కొత్తగా విపశ్వన శిబిరం (జిప్సీ) అంతర్జాతీయ ధ్యాన కేంద్రం ఆదివా రం ప్రారంభించారు.

ధ్యాన కేంద్రం ప్రారంభం
ధ్యానం చేయిస్తున్న అచార్యులు, పాల్గొన్న డాక్టర్‌ సునీత, ప్రజలు

పులివెందుల టౌన్‌, మార్చి 19: పట్టణంలోని న్యాక్‌ బిల్డింగ్‌ వెనుక 19.50ఎకరాల్లో రూ.2కోట్లతో కొత్తగా విపశ్వన శిబిరం (జిప్సీ) అంతర్జాతీయ ధ్యాన కేంద్రం ఆదివా రం ప్రారంభించారు. ఆచార్యులు మోహన్‌రాజ్‌, శబరిన కటకం ద్వారా ధ్యానకేంద్రం ప్రారంభించారు. ఈ శిబిరం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఆరుచోట్ల ఉందన్నారు. పులివెందుల ప్రజలకు ఆరు నెలల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని వారు వివరించారు. మనసుని నిర్మలపరిచే విద్య దొరకడం చాలా అరుదని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇదిలా ఉండగా పులివెందులలో ధ్యాన కేంద్రం ఏర్పాటుకు మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డికి చెందిన 19.50ఎకరాలు ఆయన కుటుం బ సభ్యులు ధ్యాన కేంద్రానికి ఉచితంగా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, పట్టణంలోని ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T23:16:59+05:30 IST