8న ఏపీసీపీఎస్‌ఏఈ ఉద్యోగుల ప్రతిఘటన

ABN , First Publish Date - 2023-06-26T00:02:03+05:30 IST

సీపీ ఎస్‌ను వ్యతిరేకిస్తూ పా త పెన్షన విధానం కావా లని కోరుతూ జూలై 8న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్‌ల వద్ద ‘ప్రతిఘ టన’ పేరుతో నిరసన కార్య క్రమం చేపట్టినట్లు ఉమ్మ డి చిత్తూరు జిల్లా ఏపీసీపీఎస్‌ఈఏ అధ్యక్షుడు పచ్చర్ల సుధాకర్‌ తెలిపారు.

 8న ఏపీసీపీఎస్‌ఏఈ ఉద్యోగుల ప్రతిఘటన
వాల్‌పోస్టర్లు ఆవిష్కరిస్తున్న దృశ్యం

పీలేరు, జూన 25: సీపీ ఎస్‌ను వ్యతిరేకిస్తూ పా త పెన్షన విధానం కావా లని కోరుతూ జూలై 8న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్‌ల వద్ద ‘ప్రతిఘ టన’ పేరుతో నిరసన కార్య క్రమం చేపట్టినట్లు ఉమ్మ డి చిత్తూరు జిల్లా ఏపీసీపీఎస్‌ఈఏ అధ్యక్షుడు పచ్చర్ల సుధాకర్‌ తెలిపారు. ప్రతిఘటన వాల్‌పోస్టర్లను ఆదివారం ఆయన పీలేరు లోని తమ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీపీఎస్‌ను రద్దు చేస్తానని 109సార్లు ప్రకటించిన జగన్మోహన రెడ్డి అధికారంలోకి వచ్చాక మాటమార్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి గొప్పదిగా చెప్పుకుంటున్న గ్యారంటీ పెన్షన స్కీం(జీపీఎస్‌)ను రాష్ట్రంలోని 3 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు నమ్మడం లేదని, వారు దానిని గోల్‌మాల్‌ పెన్షన స్కీంగా భావిస్తున్నారని, అయినప్పటికీ ప్రభు త్వం దానిని తమపై బలవంతంగా రుద్దుతోందని ఆయన ఆరో పించారు. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా సీపీఎస్‌ ఉద్యోగులంద రూ కలెక్టరేట్‌ల ముట్టడి కార్యక్రమం తలపెట్టామని, రాష్ట్రంలోని సీపీఎస్‌ ఉద్యోగులందరూ పాల్గొని దానిని విజయవంతం చేయా లని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు శ్రీధర్‌ కుమార్‌, నరేశ కుమార్‌, జయప్రకాశ, నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:02:03+05:30 IST