నియోజకవర్గంలో 20వేల ఓట్లు తొలగించారు..!
ABN , First Publish Date - 2023-10-30T23:44:04+05:30 IST
మదన పల్లె నియోజకవర్గంలో 10 నుంచి 20 వేల దాకా ఓట్లు తొలగించినట్లు తమకు సమాచారం వచ్చిందని మదనపల్లె టీడీపీ ఇనచార్జి మాజీ ఎమ్మెల్యే దొమ్మల పాటి రమేశ పేర్కొన్నారు.
ముసాయిదా జాబితా పరిశీలించండి
క్లస్టర్ ఇనచార్జిలకు దొమ్మలపాటి సూచనలు
మదనపల్లె టౌన, అక్టోబరు 30: మదన పల్లె నియోజకవర్గంలో 10 నుంచి 20 వేల దాకా ఓట్లు తొలగించినట్లు తమకు సమాచారం వచ్చిందని మదనపల్లె టీడీపీ ఇనచార్జి మాజీ ఎమ్మెల్యే దొమ్మల పాటి రమేశ పేర్కొన్నారు. దీనిపై టీడీపీ క్లస్టర్, బూత ఇనచార్జిలు కలసి అధికా రులు విడుదల చేసిన ముసాయిదా ఓట రు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయన సూచించారు. సోమవారం స్థానిక అన్నమయ్యసర్కిల్లోని టీడీపీ కార్యాలయం లో నియోజవకర్గంలోని టీడీపీ క్లస్టర్ ఇనచార్జిల సమావేశంలో దొమ్మలపాటి మాట్లా డుతూ తొలగించిన ఓట్లను తిరిగి పొందేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కుటుంబ సాధి కారసారథులు 100 కుటుంబాలకు ఒక చైతన్య భేరి పెట్టి, లాగిన కావాలన్నారు. తాము చేపడుతున్న కార్యక్రమాలను ఫొటోలతో సహా అప్లోడ్ చేయాలన్నారు. చంద్రబాబును అరెస్టు చేసి వైసీపీ నాయకులు టీడీపీ వారిని భయపెట్టాలని చేస్తున్నారని, ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడవద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అరాచక పాలన, వైసీపీ నాయకుల దోపిడి గురించి ప్రజలకు వివరించాలన్నారు. సమావేశంలో నియోజక వర్గ టీడీపీ పరిశీలకుడు చలపతినాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు దేవరింటి శ్రీనివాసులు, తాజ్బాషా, నిస్సార్అహ్మద్, విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.