ప్రవేశ పరీక్షతోనే నర్సింగ్‌ సీట్లు

ABN , First Publish Date - 2023-03-19T02:45:31+05:30 IST

నర్సింగ్‌ కోర్సుల్లో చేరేందుకు ప్రవేశ పరీక్ష తప్పనిసరి అని ఉన్నత విద్యామండలి తెలిపింది. ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ మార్గదర్శకాల మేరకు 2023- 24 విద్యా సంవత్సరం నుంచి కౌన్సెలింగ్‌ ద్వారానే ప్రవేశాలు ఉంటాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ మార్కుల ఆధారంగానే నర్సింగ్‌ కోర్సుల్లో సీట్లు కేటాయిస్తున్నారు.

ప్రవేశ పరీక్షతోనే నర్సింగ్‌ సీట్లు

వారూ ఇకపై ఈఏపీసెట్‌ రాయాల్సిందే

స్పష్టం చేసిన ఉన్నత విద్యామండలి

మరావతి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): నర్సింగ్‌ కోర్సుల్లో చేరేందుకు ప్రవేశ పరీక్ష తప్పనిసరి అని ఉన్నత విద్యామండలి తెలిపింది. ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ మార్గదర్శకాల మేరకు 2023- 24 విద్యా సంవత్సరం నుంచి కౌన్సెలింగ్‌ ద్వారానే ప్రవేశాలు ఉంటాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ మార్కుల ఆధారంగానే నర్సింగ్‌ కోర్సుల్లో సీట్లు కేటాయిస్తున్నారు. వైఎ్‌సఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ఈ ప్రక్రియ చేపడుతోంది. నర్సింగ్‌ కౌన్సిల్‌ నూతన మార్గదర్శకాలతో ఇకనుంచి ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా సీట్లకు ఏటా నిర్వహిస్తోన్న ఈఏపీసెట్‌లో నర్సింగ్‌ను కూడా చేర్చబోతున్నారు. బీఎస్సీ(నర్సింగ్‌)లో అడ్మిషన్లు కావాలనుకునే విద్యార్థులంతా ఈఏపీసెట్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఉన్నత విద్యామండలి సూచించింది.

Updated Date - 2023-03-19T02:45:31+05:30 IST