15 కేజీల గంజాయి స్వాధీనం
ABN , First Publish Date - 2023-03-31T00:30:08+05:30 IST
గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను టూటౌన్ పోలీసులు అరెస్టుచేశారు. గురువారం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ డాక్టర్ స్రవంతిరాయ్ ముఠా వివరాలను వెల్లడించారు.
ముఠా సభ్యుల అరెస్టు
వివరాలు వెల్లడించిన డీఎస్పీ స్రవంతిరాయ్
తెనాలిక్రైం,మార్చి 30: గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను టూటౌన్ పోలీసులు అరెస్టుచేశారు. గురువారం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ డాక్టర్ స్రవంతిరాయ్ ముఠా వివరాలను వెల్లడించారు. గతంలో హత్య, గంజాయి దొంగతనం కేసుల్లో నిందితులైన ఐలా శ్రీనివాస్ అలియా స్ సాయి(26) ఆధ్వర్యంలో ఐదుగురు ముఠాగా స్థానిక ఐతానగర్ ప్యాడిసన్పేట కమిటీ హాలు వద్ద గంజాయి అమ్మకాలు సాగిస్తుండగా ఆ ముఠాను ఎస్ఐ బి.శివరామయ్య ఆఽధ్వర్యంలో పోలీసు బృం దం బుధవారం అదుపులోకి తీసుకుంది. వారి వద్ద నుంచి రూ.2 లక్షల విలువైన 15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నర్సీపట్నంకు చెందిన విష్ణు అనే వ్యక్తినుంచి కిలో గంజాయి రూ.5వేలకు కొనుగోలు చేసి, ఆ గంజాయిని 10, 20 గ్రాముల వంతున ప్యాకెట్లగా చేసి రూ.200, రూ.400 చొప్పున అమ్మకాలు సాగిస్తున్నారని తెలిపారు. నిందితుల్లో నందులపేటకు చెందిన ఐలా శ్రీనివాస్ అలియాస్సాయి (26), దేవరకొండ మణిశివశంకర్ (19), ఐతానగర్కు చెందిన తాడికొండ చంద్రశేఖర్(32), తోతపూడి సునీల్ (22), పల్లి సంజయ్ (22), వల్లభాపురం సునీల్ (22)గుర్తించడం జరిగిందన్నారు. ఈ ముఠాలో మరో సభ్యుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ ఎస్.వెంక్రటావు, ఎస్ఐ.శివరామయ్య, సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నిందితులను కోర్టుకు హాజరు పరుస్తామని తెలిపారు.