టీఎస్‌ ఎంసెట్‌ ఫలితాల్లో నారాయణ జయభేరి

ABN , First Publish Date - 2023-05-26T00:03:44+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎంసెట్‌ ఫలితాల్లో గుంటూరు జిల్లా నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని ఇన్‌చార్జి తార్నాక చంద్రశేఖర్‌, డీజీఎం శ్రీనివాసరెడ్డి, కోర్‌ డీన్‌ వీరగంధం శ్రీనివాసరావులు గురువారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

టీఎస్‌ ఎంసెట్‌ ఫలితాల్లో నారాయణ జయభేరి
ర్యాంకులు సాధించిన విద్యార్థులతో తార్నాక చంద్రశేఖర్‌ తదితరులు

గుంటూరు(విద్య), మే 25: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎంసెట్‌ ఫలితాల్లో గుంటూరు జిల్లా నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని ఇన్‌చార్జి తార్నాక చంద్రశేఖర్‌, డీజీఎం శ్రీనివాసరెడ్డి, కోర్‌ డీన్‌ వీరగంధం శ్రీనివాసరావులు గురువారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. అగ్రికల్చరల్‌ విభాగంలో జీ.అలేఖ్యదేవి 54వ ర్యాంకు, వై వెంకట సాయిశ్రీ 101, కే.జ్యోతికా 157, హర్షవర్ధన్‌రెడ్డి 169, కే.వెంకటేశ్వర్లు 279, సాయిహేమాన్విత 297, నస్రీన్‌ 333, ధనుశ్రీ 371, మహాలక్ష్మీ 482, లక్ష్మీ ప్రసన్న 548, కీర్తివర్షిత 800, దీపక్‌మణిశంకర్‌ 811, రుష్మిత 901, నాగచైతన్య 987 ర్యాంకులు సాధించారని తెలిపారు. ఎంపీసీ విభాగంలో 1000 లోపు ఏడు ర్యాంకులు సాధించారని వెల్లడించారు. విద్యార్థిని విద్యార్ధులను ఏజీఎం హనుమంతరావు, డీన్లు వల్లభరావు, కోటేశ్వరరావు అభినందించారు.

Updated Date - 2023-05-26T00:03:44+05:30 IST