రూ.1000 కోట్ల అప్పు
ABN , First Publish Date - 2023-09-20T02:52:43+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇంకో రూ.1000 కోట్ల అప్పు తెచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఆర్బీఐకి జగన్ సర్కారు సమాచారం..
అమరావతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇంకో రూ.1000 కోట్ల అప్పు తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 21న నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ రుణం తెచ్చుకుంటామని ఆర్బీఐకి సమాచారమిచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి రూ.40,500 కోట్లు అప్పు తెచ్చింది. కొత్తరుణంతో కలిపి ఇది రూ. 41,500 కోట్లకు చేరుతుంది. దీంతో కార్పొరేషన్లు, ఇతర మార్గాల ద్వారా కలిపి ఏప్రిల్ నుంచి ప్రభుత్వం చేసిన అప్పు రూ.62,500 కోట్లు దాటింది.