Peetala Sujatha: జగన్ ఆడిన వికృత క్రీడలో నాడు సునీల్.. నేడు సంజయ్ బలి

ABN , First Publish Date - 2023-07-12T15:54:44+05:30 IST

తన అవసరాల కోసం ఎస్సీ, ఎస్టీలను వాడుకుని వారిని బలిచేయటం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి పీతల సుజాత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Peetala Sujatha: జగన్ ఆడిన వికృత క్రీడలో నాడు సునీల్.. నేడు సంజయ్ బలి

అమరావతి: తన అవసరాల కోసం ఎస్సీ, ఎస్టీలను వాడుకుని వారిని బలిచేయటం జగన్మోహన్ రెడ్డికి (CM YS Jaganmohan Reddy) వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి పీతల సుజాత్ (Former Minister Peetala Sujatha) ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఐడీ చీఫ్‌లుగా నాడు సునీల్, నేడు సంజయ్‌లు జగన్ ఆడిన వికృత క్రీడలో బలిపశువులయ్యారన్నారు. ఇద్దరూ ఐపీసీ నిబంధనలు పక్కన పెట్టి వైసీపీ రూల్స్ అమలు చేసినందుకు సమస్యలు కొనితెచ్చుకున్నారని తెలిపారు. స్వప్రయోజనాల కోసం వాడుకున్నంత కాలం వాడుకుని ఇప్పుడు పక్కకు నెట్టేశారని మండిపడ్డారు. సీఎం ఒత్తడి వల్లే సంజయ్ మార్గదర్శిపై చట్ట విరుద్ధంగా వెళ్లి ఇబ్బందులు తెచ్చుకున్నారన్నారు. ఇదే విషయం సంజయ్ న్యాయస్థానంలో ఎక్కడ చెప్తారోననే ఆయన్ని దాచిపెట్టి అనారోగ్యం డ్రామా ఆడుతున్నారనే ప్రచారం ఉందన్నారు. సీఐడీ చీఫ్‌గా తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన పీఎస్ఆర్ ఆంజనేయులైనా సజ్జల, జగన్ చెప్పినట్లు చేయకుండా రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటూ తన గౌరవం కాపాడుకోవాలని పీతల సుజాత హితవుపలికారు.

Updated Date - 2023-07-12T15:54:44+05:30 IST