TTD: తిరుమలలో మరోసారి విమాన కలకలం

ABN , First Publish Date - 2023-06-04T21:20:35+05:30 IST

తిరుమల (Tirumala)లో మరోసారి విమాన సంచారం కలకలం సృష్టించింది. తిరుమల క్షేత్రానికి అతిసమీపంలో విమానం ప్రయాణించడం చర్చనీయాంశమైంది.

TTD: తిరుమలలో మరోసారి విమాన కలకలం

తిరుమల: తిరుమల (Tirumala)లో మరోసారి విమాన సంచారం కలకలం సృష్టించింది. తిరుమల క్షేత్రానికి అతిసమీపంలో విమానం ప్రయాణించడం చర్చనీయాంశమైంది. ఆదివారం ఉదయం 8.30 గంటల సమయంలో విమానం క్షేత్రం మీదుగా ప్రయాణించింది. సాధారణంగా ఆలయంపై విమానాలు ప్రయాణించకూడదనే ఆగమ నిబంధన ఉంది. ఈక్రమంలోనే తిరుమలను నోఫ్లైయింగ్‌ జోన్‌గా ప్రకటించాలని టీటీడీ కేంద్రాన్ని పలుమార్లు కోరినప్పటికీ కేంద్రం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. అయినప్పటికీ టీటీడీ (TTD) విజ్ఞప్తి, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని వీలైనంతవరకు విమానాలను తిరుమలక్షేత్రం మీదుగా రానియ్యకుండా కేంద్రం సహకరిస్తోంది. తాజాగా ఆదివారం ఓ విమానం ప్రయాణించడం కలకలం రేగింది. ఇటీవల తరుచూ క్షేత్రం మీదుగా విమానాలు ఎక్కువగా ప్రయాణిస్తున్న క్రమంలో మరోసారి టీటీడీ అధికారులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Updated Date - 2023-06-04T21:20:35+05:30 IST