వైఎస్సార్ యంత్రసేవా పథకం మెగా మేళా
ABN , First Publish Date - 2023-06-03T00:08:15+05:30 IST
కాకినాడ రూరల్, జాన్ 2: కాకినాడ జిల్లా క్రీడామైదానంలో వైఎస్సార్ యంత్రసేవా పథకం మెగా మేళా-2ను శుక్రవారం జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో కాకినాడ ఎంపీ వంగా గీత, కలెక్టర్ కృతికాశుక్లా, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ జేడీ ఎన్.విజయ్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గీత మాట్లాడుతూ పంటసాగులో రైతువేసే ప్రతీ అడుగులోనూ ప్రభుత్వం తోడుగా ఉం టుందన్నారు. కలెక్టర్
కాకినాడ రూరల్, జాన్ 2: కాకినాడ జిల్లా క్రీడామైదానంలో వైఎస్సార్ యంత్రసేవా పథకం మెగా మేళా-2ను శుక్రవారం జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో కాకినాడ ఎంపీ వంగా గీత, కలెక్టర్ కృతికాశుక్లా, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ జేడీ ఎన్.విజయ్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గీత మాట్లాడుతూ పంటసాగులో రైతువేసే ప్రతీ అడుగులోనూ ప్రభుత్వం తోడుగా ఉం టుందన్నారు. కలెక్టర్ కృతికాశుక్లా మాట్లాడుతూ సాగును లాభ సాటిగా మార్చేందుకే వ్యవసాయ యంత్రాలను రైతుగ్రూ్పలకు అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి వైఎస్సార్ యంత్ర సేవాపఽథకం కింద రూ.4.16 కోట్లు రాయితీసొమ్ము మెగాచెక్కును రైతులకు అందజేసారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.