వైఎస్సార్ ఆసరాలో రూ.276.33 కోట్లు జమ
ABN , First Publish Date - 2023-03-26T01:37:09+05:30 IST
స్వయం సహాయక సంఘాలు తీసుకున్న బ్యాంకు రుణాలను తిరిగి చెల్లిస్తానన్న హామీతో జిల్లాలో ఇప్పటివరకూ 3 విడతల్లో రూ.829.44 కోట్ల మేర బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని కలెక్టర్ మాఽధవీలత తెలిపారు.
బొమ్మూరు, మార్చి 25: స్వయం సహాయక సంఘాలు తీసుకున్న బ్యాంకు రుణాలను తిరిగి చెల్లిస్తానన్న హామీతో జిల్లాలో ఇప్పటివరకూ 3 విడతల్లో రూ.829.44 కోట్ల మేర బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని కలెక్టర్ మాఽధవీలత తెలిపారు. శనివారం వర్చువల్ విధానంలో వైఎస్సార్ ఆసరా మూడో విడతగా ఎస్హెచ్జీ గ్రూపుల మహిళల ఖాతాల్లో సీఎం జగన్ దెందు లూరులో బటన్ నొక్కి జమ చేశారు. జిల్లా నుంచి కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ 2021లో 32,313 గ్రూపులకు రూ.274.90 కోట్లు, 2022లో 32,513 గ్రూపులకు రూ.278.22 కోట్లు, 2023లో 32,491 గ్రూపులకు 276.33 కోట్లు జమ చేశామన్నారు. డీసీసీబీ చైర్మన్ ఆకుల. వీర్రాజు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలపడి కుటుంబ శ్రేయస్సుకు దోహదపడే విధంగా సీఎం ముందుచూపుతో ఆలోచించారన్నారు. మొత్తం మూడు విడతల్లో 78.94 లక్షల అక్కచెల్లెమ్మలకు రూ. 19,178.17 కోట్లు లబ్ధిని చేకూర్చడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ సుభాషిణీ, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.