మతి స్థిమితంలేని మహిళ అప్పగింత

ABN , First Publish Date - 2023-03-31T00:17:51+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టానికి చెందిన ఓ మతి స్థిమితంలేని మహిళను దిశ వన్‌స్టాప్‌ సెం టర్‌ సిబ్బంది అక్కున చేర్చుకుని కుటు ంబీకులకు అప్పగించిన సంఘటన గురువారం జరిగింది. వివరాలిలా ఉ న్నాయి. గత కొన్ని రోజులుగా సుమారు 30ఏళ్ల మతిస్థిమితం లేని మహిళ సా మర్లకోట రైల్వేస్టేషనలో ఉంటుందని ఈనెల 9న సామర్లకోట సెక్షన్‌ చీఫ్‌ కమర్షియల్‌ రైల్వే ఇన్స్‌పెక్టర్‌ సంతోష్‌ కుమార్‌ ఐసీడీఎస్‌ పీడీ కె.ప్రవీణ

మతి స్థిమితంలేని మహిళ అప్పగింత

కాకినాడ క్రైం, మార్చి 30: ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టానికి చెందిన ఓ మతి స్థిమితంలేని మహిళను దిశ వన్‌స్టాప్‌ సెం టర్‌ సిబ్బంది అక్కున చేర్చుకుని కుటు ంబీకులకు అప్పగించిన సంఘటన గురువారం జరిగింది. వివరాలిలా ఉ న్నాయి. గత కొన్ని రోజులుగా సుమారు 30ఏళ్ల మతిస్థిమితం లేని మహిళ సా మర్లకోట రైల్వేస్టేషనలో ఉంటుందని ఈనెల 9న సామర్లకోట సెక్షన్‌ చీఫ్‌ కమర్షియల్‌ రైల్వే ఇన్స్‌పెక్టర్‌ సంతోష్‌ కుమార్‌ ఐసీడీఎస్‌ పీడీ కె.ప్రవీణకు సమాచారం అందించారు. ఆ మహిళకు వసతి కల్పించాలని పీడీ దిశ వన్‌స్టాప్‌ సెంటర్‌ అడ్మినిస్ర్టేటర్‌ ఆర్‌.శైలజను ఆ దేశించడంతో సెంటర్‌కు తరలించి వస తికల్పించారు. సిబ్బంది ఆ మహిళను వివరాలు అడగడంతో తనది ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, గోరక్‌పూర్‌ అని మాత్రం చెప్పగల్గింది. సిబ్బంది ఆ మహిళ ఫొటో ను గోరక్‌పూర్‌ పోలీసులకు పంపించి ఆమె సమాచారాన్ని ఇచ్చారు. దాంతో అక్కడ పోలీసులు ఆ మహిళ కుటుం బసభ్యులతో ఇక్కడ వన్‌స్టాప్‌ సెంటర్‌ సిబ్బందితో మాట్లాడించగా ఆ మహిళ పేరు ప్రియాంక షైనీ అని తెలిపారు. షైనీ కుటుంబ సభ్యులు గురువారం దిశ వన్‌స్టాప్‌ సెంటర్‌కు చేరుకుని అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపి ఆమెను స్వగ్రామానికి తీసుకెళ్లారు.

Updated Date - 2023-03-31T00:17:51+05:30 IST