‘ఉమ్మడి మేనిఫెస్టోతో మేలు’
ABN , Publish Date - Dec 24 , 2023 | 12:46 AM
తుని రూరల్, డిసెంబరు 23: టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫోస్టోతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని తుని టీడీపీ ఇన్చార్జి యనమల దివ్య తెలిపారు. తుని 19వ వార్డులో రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ టీడీపీ, జ
తుని రూరల్, డిసెంబరు 23: టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫోస్టోతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని తుని టీడీపీ ఇన్చార్జి యనమల దివ్య తెలిపారు. తుని 19వ వార్డులో రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ టీడీపీ, జనసేన పార్టీలను గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా తెలుగు యు వత అధ్యక్షుడు యనమల శివరామకృష్ణన్, పోల్నాటి శేషగిరిరావు, టీడీపీ జిల్లా ఉపా ధ్యక్షులు సుర్ల లోవరాజు, చింతమనేడి నాగ సోమరాజు, ఇనిగంటి సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్లు మల్ల గణేష్కుమార్, అల్లురాజు, సిద్దాంతపు సత్తిబాబు పాల్గొన్నారు.