రేపు అంతర్వేదిలో సప్తనదీ జలాభిషేకం
ABN , First Publish Date - 2023-06-03T01:37:14+05:30 IST
అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం 5.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఆలయంలో సప్తనదీ తీర్థ మహాజ్యేష్ఠాభిషేక మహోత్సవం వైభవ ంగా జరపనున్నట్టు ఆలయ సహాయ కమిషనర్ వి.సత్యనారాయణ తెలిపారు.
అంతర్వేది, జూన్ 2: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం 5.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఆలయంలో సప్తనదీ తీర్థ మహాజ్యేష్ఠాభిషేక మహోత్సవం వైభవ ంగా జరపనున్నట్టు ఆలయ సహాయ కమిషనర్ వి.సత్యనారాయణ తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని పవిత్ర త్రివేణి సంగమం నుంచి గంగా, యుమన, సరస్వతి నదీ జలాలు, పవిత్ర గోదావరి జలాలు, గుజరాత్లో ని నర్మాదానది, పాకిస్తాన్ దేశం కరాచీలోని సింధూ జలాలు, తమిళనాడులోని పవిత్ర కావేరి నదీ జలాల ను సేకరించి ఆలయంవద్దకు తీసుకువచ్చినట్టు తెలిపారు. ఈ సప్తనదీ జలాలతో స్వామివారి మూలవ రులకు మహా జ్యేష్ఠాభిషేకం జరగనుందన్నారు. భక్తులు రూ.400 టిక్కెట్ తీసుకుని మహాశాంతి హోమం, సప్తనదీ జలాభిషేకంలో పాల్గొనవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ ప్రధానార్చకులు పాణింగ పల్లి శ్రీనివాసకిరణ్, స్థానాచార్య, అర్చక, వేదపండితులతో ఈ మహాజ్యేష్ఠాభిషేకం జరగనుందని తెలిపారు.