వచ్చే నెల 3 నుంచి పది పరీక్షలు

ABN , First Publish Date - 2023-03-19T01:26:52+05:30 IST

జిల్లా పరిధిలో తొలిసారిగా వచ్చే నెల 3నుంచి 18వ తేదీ వరకూ పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నామని డీఆర్‌వో జి.నరసింహులు, డీఈవో ఎస్‌. అబ్ర హాం తెలిపారు.

 వచ్చే నెల 3 నుంచి పది పరీక్షలు

రాజమహేంద్రవరం, మార్చి18 (ఆంధ్రజ్యోతి) : జిల్లా పరిధిలో తొలిసారిగా వచ్చే నెల 3నుంచి 18వ తేదీ వరకూ పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నామని డీఆర్‌వో జి.నరసింహులు, డీఈవో ఎస్‌. అబ్ర హాం తెలిపారు.కలెక్టరేట్‌లో శనివారం సమీక్షించారు. 126 కేంద్రాల్లో రెగ్యులర్‌ విద్యార్దులు, 29 కేంద్రాల్లో ఓపెన్‌ సెకండరీ స్కూల్‌ కోర్సులకు పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు.పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, ఏ చిన్న పొరపాటుకు తావులేకుండా పరీక్షలు నిర్వహించాలన్నారు. సుమారు 26 వేల మంది రెగ్యులరు విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్టు చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి ఆయా రూట్లలో ఆర్టీసీ బస్సులు అం దుబాటులో ఉంచాలన్నారు. ప్రతి రోజూ పరీక్ష ఉదయం 9.30 నుంచి 1245 గంటల వరకూ జరుగుతుందన్నారు. ఏపీ ఓపెన్‌ స్కూల్‌ పదవ తరగతి విద్యార్థులు 2092 మందికి 7 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇంటర్‌ పరీక్షలకు 4190 మంది విద్యార్థులు హాజరవుతారని.. 14 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.ఈ పరీక్షలు ప్రతి రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటలవరకూ జరుగుతాయన్నారు.విద్యార్థులు సమయాన్ని సద్విని యో గం చేసుకుని చదువుకోవాలని సూచించారు.

Updated Date - 2023-03-19T01:26:52+05:30 IST