గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి

ABN , First Publish Date - 2023-06-26T00:22:46+05:30 IST

తుని రూరల్‌, జూన్‌ 25: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సూచించారు. తుని పట్టణానికి చెందినటీడీపీ కార్యకర్తలు, నాయకులతో ఆయన ఆదివా రం సమావేశమయ్యారు. తేటగుంట గ్రామంలో రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ యనమల కృష్ణుడు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రామకృష్ణుడు పలు కీలక సూచనలు చేశారు. పట్టణ సమస్యలపై గళమెత్తాలని, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ

గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి
తేటగుంటలో మాట్లాడుతున్న యనమల

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల

తుని రూరల్‌, జూన్‌ 25: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సూచించారు. తుని పట్టణానికి చెందినటీడీపీ కార్యకర్తలు, నాయకులతో ఆయన ఆదివా రం సమావేశమయ్యారు. తేటగుంట గ్రామంలో రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ యనమల కృష్ణుడు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రామకృష్ణుడు పలు కీలక సూచనలు చేశారు. పట్టణ సమస్యలపై గళమెత్తాలని, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోల్నాటి శేషగిరిరావు, మేతుకూరి వెంకటేష్‌, ఇనిగంటి సత్యనారాయణ, కుక్కడపు బాలాజీ, దిబ్బ శ్రీను, లంక సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:22:46+05:30 IST