బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి

ABN , First Publish Date - 2023-03-31T00:15:04+05:30 IST

బాధిత కుటు ంబం డిమాండ్లు నెరవేర్చి వారిని ప్రభుత్వ ం అన్నివిధాలా ఆదుకోవాలని శాసన మం డలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన టీడీ పీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యనమ ల కృష్ణుడితో కలిసి ఇటీవల దాడిలో శృం గవృక్షంలో మృతిచెందిన నడిపల్లి రాము కు టుంబ సభ్యులను తొండంగిలో పరామర్శించారు. బాఽధిత కుటుంబం డిమాండ్లు నెరవేర్చ

బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి
బాధితులను పరామర్శిస్తున్న రామకృష్ణుడు

మండలి ప్రతిపక్ష నేత యనమల

తొండంగి, మార్చి 30: బాధిత కుటు ంబం డిమాండ్లు నెరవేర్చి వారిని ప్రభుత్వ ం అన్నివిధాలా ఆదుకోవాలని శాసన మం డలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన టీడీ పీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యనమ ల కృష్ణుడితో కలిసి ఇటీవల దాడిలో శృం గవృక్షంలో మృతిచెందిన నడిపల్లి రాము కు టుంబ సభ్యులను తొండంగిలో పరామర్శించారు. బాఽధిత కుటుంబం డిమాండ్లు నెరవేర్చవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వం అందించే భూమి కొండ పో డు లాంటి భూమి కాకుండా వ్యవసాయ యోగ్యమైనదిగా ఉండాలన్నారు. ప్రభుత్వ పరంగా అందించాల్సిన అన్ని సహాయాలను త్వరితగతిన అందేవిధంగా కలెక్టర్‌తో మా ట్లాడతానని ఆయన తెలిపారు. యనమల కృష్ణుడు మాట్లాడుతూ పండగలు, జాతరల లో గ్రామస్తులంతా కలిసి మెలసి ఉండాల్సి ఉండగా ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరగడం బాధాకరమన్నారు. ఇటువం టి సంప్రదాయం మన ప్రాంతంలో లేదన్నారు. అన్ని కులాలు అన్నదమ్ముల్లా కలిసి మె లిసి జీవించే గ్రామాల్లో ఉత్సవాలు ప్రజల జీవనంలో భాగమని వాటిని ఆనందంగా ఆస్వాదించాలి తప్ప ఘర్షణలకు దిగి ప్రా ణాలు తీసే వరకూ వెళ్లడం చెడు సంప్రదాయానికి సంకేతమన్నారు. బాధిత కుటుంబానికి రామకృష్ణుడు, కృష్ణుడు ఆర్థిక సాయం ఆర్థికం సాయం అందించారు. శృంగవృక్షంలో గాయపడినవారిని కూడా పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందించారు. వారి వెంట తెలుగు రైతు కార్యనిర్వాహ క కార్యదర్శి పేకేటి హరి కృష్ణ, జిల్లా మత్స్యకార అధ్యక్షుడు కోడ వెంకటరమణ, మురాలశెట్టి సత్యన్నారాయణ, పిల్లిబాబ్జి, బండి చిట్టిబాబు, బూర్తి సింహాచలం, పెదపూడి గవరయ్య, పెయ్యల సూర్యారావు ఉన్నారు.

Updated Date - 2023-03-31T00:15:04+05:30 IST