సర్వీసు నిబంధనలపై స్పష్టత ఇవ్వాలి

ABN , First Publish Date - 2023-03-26T01:10:35+05:30 IST

పురపాలక ఉపాధ్యాయులకు జిల్లా యూనిట్‌గా బదిలీలు, పదోన్నతులు చేపట్టడానికి సర్వీసు నిబంధనల ముసాయిదాను పాఠశాల విద్యాశాఖ రూపొందించిందని, అయితే ఇది కొత్త జిల్లాల ప్రకారం ఉంటుందా లేక పాత జిల్లాల ప్రకారం ఉంటుందా అనే దానిపై స్పష్టత ఇవ్వాలని యూటీఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ జేవీవీ సుబ్బారావు కోరారు.

సర్వీసు నిబంధనలపై స్పష్టత ఇవ్వాలి

రాజమహేంద్రవరం అర్బన్‌, మార్చి 25 : పురపాలక ఉపాధ్యాయులకు జిల్లా యూనిట్‌గా బదిలీలు, పదోన్నతులు చేపట్టడానికి సర్వీసు నిబంధనల ముసాయిదాను పాఠశాల విద్యాశాఖ రూపొందించిందని, అయితే ఇది కొత్త జిల్లాల ప్రకారం ఉంటుందా లేక పాత జిల్లాల ప్రకారం ఉంటుందా అనే దానిపై స్పష్టత ఇవ్వాలని యూటీఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ జేవీవీ సుబ్బారావు కోరారు. ఈమేరకు శనివారం యూటీఎఫ్‌ ఆధ్వర్యంలోజిల్లాస్థాయి మున్సిపల్‌ సబ్‌ కమిటీ సమావేశం యూటీఎఫ్‌ హోంలో జరిగింది. ఈ సందర్బంగా సుబ్బారావు మాట్లాడుతూ పురపాలక పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను పాఠశాల విద్యాశాఖకు అప్పగించడంతో ఈ సర్వీసు నిబంధలను రూపొందించారని, దీన్ని పురపాలక ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్‌, కార్యదర్శి రవిబాబు, విజయగౌరి, కన్నమ నాయుడు, సుహాసిన తదితరులు పాల్గొన్నారు. ర్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T01:10:35+05:30 IST