ఆర్టీసీ ఆదాయం పెంచాలి
ABN , First Publish Date - 2023-03-29T00:50:43+05:30 IST
ప్రయాణీకుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు సర్వీసులు తిప్పాలని, ఇదే సమయంలో ఆర్టీసీ ఆదాయం పెంచడానికి చర్యలు చేపట్టాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వరరావు అన్నారు.
రాజమహేంద్రవరం అర్బన్, మార్చి 28 : ప్రయాణీకుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు సర్వీసులు తిప్పాలని, ఇదే సమయంలో ఆర్టీసీ ఆదాయం పెంచడానికి చర్యలు చేపట్టాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వరరావు అన్నారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్టేషన్ను మంగళవారం తనిఖీ చేసి స్థానికంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లాలోని రాజమహేంద్రవరం, గోకవరం, కొవ్వూరు, నిడదవోలు డిపోల అధికారులు, ఏటీఎం (కమర్షియల్), ఇతర అధికారులతో ఆయన సమావేశమయ్యారు. రాజమహేంద్రవరం బస్టేషన్లో కొత్తగా నిర్మించనున్న రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఆర్టీసీ మహిళా సిబ్బంది విశ్రాంతి గదులు, కార్గో భవనంలో అదనంగా నిర్మించిన గదులను ప్రారంభించారు. ఆయన వెంట ఆర్టీసీ జిల్లా అధికారిణి షర్మిళా అశోక, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.