ఎస్సీ సొసైటీ భూములు అన్యాక్రాంతం చేస్తే సహించం
ABN , First Publish Date - 2023-11-10T00:22:24+05:30 IST
ఎస్సీ సొసైటీ భూములు అన్యాక్రాంతం చేస్తే సహించం
అంతర్వేది, నవంబరు 9: అంతర్వేదిపాలెంలో గురువారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాజోలు నియో జకవర్గ మహాసభ నిర్వహించారు. ఎస్సీ సొసైటీ భూములు అన్యాక్రాంతం చేయొద్దని, చమురు అన్వేషణ పేరుతో ఏవీఆర్ అనే బినామీ కంపెనీ తీర ప్రాంతంలో ఉన్న ఎస్సీ సొసైటీలకు చేయొద్దని దౌర్జన్యంగా, అన్యాయంగా లాగేసుకోవడానికి ప్రయత్నించడం దుర్గార్మమని, ప్రభుత్వం వెంటనే ఆ కంపెనీని రద్దుచేసి దళితుల భూములకు రక్షణ కల్పించాలని మహాసభ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉపాధి కూలీల వేతనాన్ని రూ.600కు పెంచాలని, పనిదినాలు 200 రోజులకు పెంచాలని సమావేశంలో తీర్మానించారు. కార్య క్రమంలో గెడ్డం ప్రభాకరరావు, కె.సత్తిబాబు, నియోజకవర్గ కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్, జంపన ప్రసాదరావు, నల్లి బుజ్జిబాబు, దీపాటి గంగాచలం తదితరులు పాల్గొన్నారు.