సత్యదేవుడి సన్నిధిలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి పూజలు
ABN , First Publish Date - 2023-06-03T01:34:23+05:30 IST
రత్నగిరిపై సత్యదేవుడి సన్నిధిలో శుక్రవారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఏవీ శేషసాయి కుటుంబసభ్యులతో స్వామివారి వ్రతమాచరించి ప్రత్యేకపూజలు నిర్వహించారు.
అన్నవరం, జూన్ 2: రత్నగిరిపై సత్యదేవుడి సన్నిధిలో శుక్రవారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఏవీ శేషసాయి కుటుంబసభ్యులతో స్వామివారి వ్రతమాచరించి ప్రత్యేకపూజలు నిర్వహించారు. వారికి ఆలయ ఈవో ఆజాద్, పండితులు ఆల య మర్యాదలతో పూర్ణకుంభస్వాగతం పలికారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనం గావించగా ఈవో చంద్రశేఖర ఆజాద్ స్వామివారి మెమెంటో, ప్రసాదాలు అందజేశారు.